పుణ్యాత్ముడు : రూ. 1 కే కిలో టమోటా.. !

-

గత పది రోజులకు పైగానే దేశ వ్యాప్తంగా ఏమి జరిగిందో తెలియదు కానీ టమోటో ధరలు మండిపోతున్నాయి. ఏ రాష్ట్రంలో చూసినా కిలో టమోటా ధర రూ. 100 కు పైగానే ఉండడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఇక ఈ కూర చేసుకోవాలన్నా టమోటా ఉండడం ఖచ్చితం కాబట్టి .. ఎంత ధర అయినా తప్పక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… తమిళనాడు లోని అన్నాడీఎంకే కార్యదర్శి ఆర్ ఎస్ రాజేష్ ప్రజల బాధలను అర్ధం చేసుకుని పార్టీ తరపున ఒక టన్ను టమోటాలను దిగుమతి చేసుకుని.. వాటిని కేవలం కేజీ రూ.1 కె విక్రయించారు. ఆర్ కె నియోజకవర్గంలోని తండయార్ పేట లో ఈ టమోటాలను 1000 మంది కొనుకోవడం విశేషం. వీటిని కొనుగోలు చేసిన అనంతరం ఆ ఏరియాలోని ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల్లో మాకు చాలా ఉపయోగకరంగా ఉందని అన్నాడీఎంకే కృతజ్ఞతలు తెలియచేశారు. కాగా పార్టీ కార్యదర్శి అయిన రాజేష్ పళనిస్వామి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేసినట్లుగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news