ప్రధానిని కలిసిన పదేళ్ల చిన్నారి.. ఫోటోలు వైరల్.. !

-

ప్రధానమంత్రి మోడీ ని కలవాలనుకున్న పదేళ్ల చిన్నారి కల నెరవేరింది. అనిషా పటేల్ అనే 10 సంవత్సరాల చిన్నారి తన తండ్రి లాప్ టాప్ నుండి హలో మోడీ సార్ నేను అనీష పాటిల్ నిజంగా వచ్చి మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నా అంటూ మెయిల్ చేసింది. కాగా ఆ మెయిల్ చూసిన ప్రధానమంత్రి ఆమె కోరిక మేరకు ఆహ్వానించారు. పరిగెత్తుకుంటూ రా బిడ్డా అంటూ హిందీలో లో పేర్కొన్నారు. ఇక ప్రధాని కార్యాలయం నుండి పిలుపు వచ్చిన వెంటనే అనిషా పాటిల్ తన కుటుంబంతో సహా పార్లమెంట్ కు వెళ్ళింది.

ప్రధాని మోడీ ని కలిసిన ఆనందంలో చిన్నారి ఇది మీ కార్యాలయమా ఎంత పెద్దగా ఉంది. మీరు రోజంతా ఎక్కడ కూర్చుంటారు. అంటూ వరుస ప్రశ్నలను అడిగింది. ఇక ప్రధాని కూడా అమ్మాయి ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. ప్రధాని ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా అనిషా పాటిల్ కోరికమేరకు కాసేపు ఆమెతో ముచ్చటించారు. దాంతో ఆ అమ్మాయి ఎంతో హాపీ గా ఫీల్ అయింది. ప్రస్తుతం ప్రధాని తో అనీషా దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దాంతో అనిషా ఎంతో లక్కీ అని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news