11వ జాబితా విడుదల చేసిన వైసీపీ

-

మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి.ఈ నేపథ్యంలో వివిధ పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి.ఇప్పటికే అధికార వైసీపీ 10 జాబితాలను విడుదల చేయగా , తాజాగా 11వ జాబితాను విడుదల చేసింది. ఇందులో రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జులను ప్రకటించింది. కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జుగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జుగా రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ ఇన్ఛార్జుగా గొల్లపల్లి సూర్యారావు పేర్లను ప్రకటించింది.

కాగా, ప్రతిపక్ష టీడీపీ-జనసేన కూడా ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను, జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news