ఆంధ్ర ప్ర‌దేశ్‌లో నేడు 1,597 క‌రోనా కేసులు.. 8 మంది మృతి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతుంది. ప్ర‌తి రోజు భారీ సంఖ్య‌లో క‌రోనా కేసులు త‌గ్గుతున్నాయి. తాజా గా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రాష్ట్ర క‌రోనా బులిటెన్ ను విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 18,601 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,597 క‌రోనా పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి.

అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల మ‌ర‌ణించారు. రాష్ట్రంలో విశాఖ ప‌ట్నం జిల్లాలో ఇద్ద‌రు, తూర్పు గోదావ‌రి, పశ్చిమ గోదావ‌రి, చిత్తూరు, క‌ర్నూలు, నెల్లురు, ప్ర‌కాశం జిల్లాలో ఒక్కొక్క‌రు చొప్పున క‌రోనా కాటుకు బ‌లై పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణాల సంఖ్య 14,672 కు చేరింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 8,766 మంది క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 62,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ నేడు రాష్ట్ర వ్యాప్తంగా 18,601 కరోనా శాంపిల్స్ ప‌రీక్ష చేయాగ ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా 3,26,79,288 క‌రోనా నిర్దార‌ణ ప‌రీక్షలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news