పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి అమానుషమని.. హేయమైనదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా శాసనసభలో సీఎం కేసీఆర్ పైవిధంగా స్పందించారు. పుల్వామా ఉగ్రదాడిపై సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఇది జవాన్లపై జరిగిన దాడి కాదు… మన జవాన్లపై జరిగిన దాడిగా వ్యాఖ్యానించారు. దేశ రక్షణ కోసం 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు తమ ప్రాణాలను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. దీంతో అమరులైన కుటుంబాలకు అండగా ఉండటం కోసం.. వాళ్ల కుటుంబాలను ఆదుకోవడం కోసం… అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాల్లో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు అందివ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. ఈ తీర్మానాన్ని శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. దీనికి సభ వెంటనే ఆమోదం తెలిపింది. అనంతరం సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. అమరుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవడం గొప్ప పని అని ప్రతిపక్ష సభ్యులు కొనియాడారు.
అమరుల కుటుంబాలకు 25 లక్షలు ప్రకటించిన సీఎం కేసీఆర్
By Anil Kumar
-
Previous article
Read more RELATEDRecommended to you
నేను ఇంకా కాంగ్రెస్ లో చేరలేదు : కడియం శ్రీహరి
తాను ఇంకా కాంగ్రెస్ లో చేరలేదని బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే...
Anji N -
పీఎం స్వానిధి పథకం.. వీధి వ్యాపారులకు తనఖా లేని రుణం అందిస్తున్న కేంద్రం
మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పిస్తున్నప్పుడు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ PM-SVANIdhi...
TDP లోక్ సభ, ఎమ్మెల్యే అభ్యర్థుల చివరి జాబితా విడుదల
TDP Lok Sabha Candidate List Released: TDP లోక్ సభ,...