దారుణం: 45 మంది టీచర్ లపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు

-

ఇండియాకు దాయాధి దేశం అయిన పాకిస్తన ఇప్పుడు ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఇక తాజాగా జరిగిన ఒక ఘటన ఆదేశంలో సంచలనాన్ని రేపుతోంది, తెలుస్తున్న సమాచారం ప్రకారం కరాచీ లోని ఒక ప్రయివేట్ స్కూల్ ప్రిన్సిపాల్ మహిళల టీచర్ లను లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. ఇతను వేధించింది ఒకరినో ఇద్దరిలో కాదు.. మొత్తం 45 మంది మహిళా టీచర్ లను వేధించి రాక్షసుడిగా పేరు తెచ్చుకున్నాడు. కరాచీ పోలీసులు తెలియచేస్తున్న సమాచారం ప్రకారం ఆ ప్రిన్సిపాల్ సదరు మహిళా టీచర్ లను బెదిరించి లొంగదీసుకున్నాడట. ఇక ఇంతటి ఘోరమైన పాపానికి ఒడిగట్టిన వ్యక్తి గపూర్ మెమన్ అని పోలీసులు తెలిపారు. ఇతను టీచర్ లకు సీసీ టీవీ ఫుటేజ్ లను చూపించి లొంగదీసుకున్నాడని అర్ధమవుతోంది. ఇంకా ఇతని నుండి కొన్ని షార్ట్ వీడియోలు, ఫోన్ , లాప్ టాప్ మరియు ఇతను ఏకాంతంగా గడిపిన మహిళా టీచర్ వీడియోను కూడా స్వాధీనం చేసుకున్నారు.

దాని ద్వారానే అసలు కథ అంతా తెలిసింది. ప్రస్తుతం ఇతనికి కరాచీ కోర్ట్ 7 రోజులు రిమాండ్ ను విధించింది. ఈ కేసును విచారించడానికి ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news