TELANGANA: ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై మంత్రి కీలక వ్యాఖ్యలు

-

ఈ రోజు మంత్రి హరీష్ రావు సంగారెడ్డి జిల్లాలో పలువురు నేతలను పార్టీలో చేర్చుకోవడానికి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ లనుండి కొందరు నేతలు BRS లో చేరారు. అక్కడ హరీష్ రావు మాట్లాడుతూ సంగారెడ్డి లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి నియోజకవర్గం అస్సలు ఎలా ఉందన్న విషాయం పట్టించుకుంటున్నారా అంటూ మాట్లాడారు. ఎన్నికలకు వచ్చిండు జోలె పట్టి ఓట్లు అడిగిండు కానీ అప్పటి నుండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేదంటూ జగ్గారెడ్డి పై విమర్శలు చేసారు మంత్రి హరీష్ రావు. అందుకే ప్రజలు ఈ సారి జగ్గారెడ్డి కి విశ్రాంతి ఇవ్వాలంటూ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ BRS అభ్యర్థిగా ఎవరు నిలబడినా అందరూ సమిష్టిగా కృషి చేసి గెలిపించుకోవాలని హరీష్ రావు నేతలలో ధైర్యాన్ని నింపారు.

ఇక ఎన్నికలకు చాలా తక్కువ సమయమే ఉన్నందున అన్ని పార్టీలు కూడా గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news