60 మంది ఎయిర్ ఇండియా పైలెట్లకు కరోనా పాజిటివ్..!

-

వందేభారత్ మిషన్ కింద విదేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చిన ఎయిర్ ఇండియా విమానాల్లో కరోనా కలకలం రేపింది. ఏకంగా 60 మంది పైలెట్లకు కరోనా సోకిందని ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పైలెట్స్ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు పైలెట్స్ కమిటీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాసింది. 137 దేశాల నుంచి 5,05,990 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చామని,

కరోనా సమయంలోనూ సేవలందిస్తున్నందున తమ సమస్యలను పరిష్కరించాలని పైలెట్ల సంఘం మంత్రిని కోరింది. కరోనా కష్ట కాలంలో విదేశాల్లో చిక్కుకున్న మన వాళ్లను తీసుకొచ్చిన పైలెట్లకు జీతాలు కోత పెట్టడం సమంజసం కాదని ఎయిర్‌‌ ఇండియా పైలెట్లు అన్నారు. జీతాల్లో కోత పెట్టడం తాము ఇబ్బందులకు గురవుతున్నామని పైలెట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news