ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ అవుట్.. 6,100 పోస్టులు..!

-

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మొత్తం 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ని తీసుకు వచ్చారు. 2,299 స్కూల్‌ అసిస్టెంట్‌, 2,280 ఎస్‌జీటీ పోస్టులు తో పాటు దీనిలో 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు, 42 ప్రిన్సిపల్‌ పోస్టులు కూడా వున్నాయి. ఈ పోస్టులు అన్నింటినీ భర్తీ చేయబోతున్నట్టు నోటిఫికేషన్‌ ని తీసుకు వచ్చారు.

ఈ నెల 22 వరకు దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు. మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్ష జరగనుంది. ఏప్రిల్‌ 15 లోగా డీఎస్సీ ఫలితాలు కూడా వచ్చేస్తాయి. 2018 సిలబస్‌ ప్రకారమే డీఎస్సీ పరీక్ష ఉంటుంది. జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు వయోపరిమితి 44 ఏళ్లు.

 

Read more RELATED
Recommended to you

Latest news