ప్రగతి భవన్ ముట్టడించిన 70 మంది ఉపాధ్యాయులు అరెస్ట్

-

ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ యత్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం ఇటీవల తీసుకువచ్చిన 317 జీవో రద్దు చేయాలనే డిమాండ్ తో ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ యత్నించారు. అయితే ఈ నేపథ్యంలోనే 70 మందికి పైగా టీచర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ ఘటనపై బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీరియస్ అయ్యారు.

317 జీవోను సవరించాలంటూ ప్రగతి భవన్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీచర్లను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బండి సంజయ్. అరెస్టు చేసిన టీచర్లందరినీ ప్రభుత్వం తక్షణమే భేషరతుగా విడుదల చేయాలని.. ఉద్యోగ, ఉపాధ్యాయుల ‘స్థానికత’కు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. 317 జీవోను సవరించే దాకా ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసే ఉద్యమానికి బీజేపీ అండగా ఉంటుందని.. 317 జీవోను సవరించేదాకా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న పోరాటాలను ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news