ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పనుందా…?

-

ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించనుంది. డియర్‌నెస్ అలవెన్స్ DA పెంపు ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిలీఫ్ ని కలిగించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో డీఏ 31 శాతం నుంచి 34 శాతానికి పెరిగింది. అలానే డీఏ అరియర్స్‌ ని కూడా పెంచడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అయితే ఇప్పుడు ఉద్యోగులు జూలై డీఏ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ వారికి బ్యాడ్ న్యూస్ తగిలేలా వుంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏడాది రెండు సార్లు డీఏ పెంపు ఉంటుందని అందరికీ తెలిసిందే. ఇక పూర్తి వివరాలను చూస్తే.. జనవరి నుంచి జూన్ కాలానికి తొలి డీఏ. అలాగే జూలై నుంచి డిసెంబర్ కాలానికి రెండో డీఏ పెంపు ఉంటుంది.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు మొదటి డీఏ పెంపు ప్రక్రియ అయ్యింది. మార్చి లో ఈ పెంపు ప్రకటన చేశారు. జూలైలో కూడా డీఏ పెంపు ఉండాలి. అయితే ఇది ఇప్పుడు ఉండకపోవచ్చని తెలుస్తోంది. అలానే ఫిబ్రవరి ఏఐసీసీఐ ఇండెక్స్ గణాంకాలు వెలువడ్డాయి. 2021 డిసెంబర్ నెలతో పోలిస్తే ఇవి క్షీణించాయి.

ఇక ఇది ఎంత తగ్గింది అనేది చూస్తే.. 2021 డిసెంబర్ నెలలో ఏఐసీపీఐ 125.4 వద్ద ఉంది. 2022 జనవరి నెలలో ఇది 0.3 పాయింట్లు తగ్గింది. 125.1కు క్షీణించింది. అదే విధంగా ఫిబ్రవరిలో కూడా తగ్గింది. 0.1 పాయింట్ క్షీణించింది. వరుసగా రెండు నెలల కాలంలో ఏఐసీపీఐ తగ్గడం వల్ల డియర్‌నెస్ అలవెన్స్ పెంపు కష్టంగా మారొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. 124 దిగువకు వస్తే డీఏ స్థిరంగా కొనసాగే అవకాశం వుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news