BREAKING : రామకృష్ణారెడ్డి దారుణ హత్యలో ఐదుగురిపై కేసు నమోదు

-

హిందూపురంలో వైసీపీ నేత హత్యకు గురయ్యాడు. నియోజక వర్గ మాజీ సమన్వయకర్తగా వ్యవహరించిన చౌళూరు రామకృష్ణా రెడ్డిని ప్రత్యర్థులు హత్య చేశారు. ఆయన ఇంటి ముందే అతనిపై కారం పొడి చల్లి.. వేట కొడవళ్లతో నరికి హత్య చేశారు. ఈ హత్య పట్టణంలో సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో కృష్ణ రామకృష్ణారెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రామకృష్ణారెడ్డి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులో విచారణ మొదలుపెట్టారు. అందులో భాగంగా అనుమానితులుగా భావిస్తున్న ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్, పిఏ గోపి కృష్ణతో పాటు చాకలి రవి, వరు, మురళి, కేబి నాగడులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హత్యలో ఎమ్మెల్సీ ఇక్బాల్ హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్న క్రమంలో ఆయన పిఏ పై పోలీసులు కేసు నమోదు చేయడం, హిందూపురం వైసిపి వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news