కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చిన వెంటనే… బిజెపి చీఫ్ పై దాడి…!

-

పశ్చిమ బెంగాల్ అలీపుర్దువార్ జిల్లాలో పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మరియు ఇతర పార్టీ నాయకుల కాన్వాయ్ పై గురువారం దాడి జరిగింది. అలాగే కల్చిని ఎమ్మెల్యే విల్సన్ చంపామారి ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసారు. బెంగాల్ బిజెపి అధ్యక్షుడి కాన్వాయ్ పై దాడి వెనుక ఎవరున్నారో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

నిరసనకారులు నల్ల జెండాలు చూపించి ‘గో బ్యాక్’ నినాదాలు కూడా చేసారు అని జాతీయ మీడియా పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌ లోని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కేడర్‌ ను దిలీప్ ఘోష్ హెచ్చరించిన కొద్ది రోజులకే ఈ దాడి జరిగింది. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని హల్దియా పట్టణంలో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన పశ్చిమ బెంగాల్ బిజెపి చీఫ్… టిఎంసి కార్మికులు, తమ వైఖరి మార్చుకోకపోతే మాత్రం వారి చేతులు, కాళ్ళు మరియు పక్కటెముకలు విరిగిపోతాయి అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news