విడిపోయిన 35 ఏళ్లకు కలిసిన జంట..

-

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు రణ్‌ధీర్‌ కపూర్‌, సీనియర్‌ నటి బబితా కపూర్‌లు విడిపోయి 35 ఏళ్లకు పైనే అవుతుంది. కాగా ఇన్నేళ్ల తర్వాత ఈ జంట మళ్ళీ కలిశారు.రణ్‌ధీర్‌ కపూర్‌, బబితా కపూర్‌లు ఇండస్ట్రీలో మంచి స్థాయిలో కొనసాగారు. ఈ సమయంలోనే ఇష్టపడి 1971లో పెళ్లి చేసుకున్నారు. కాగా కరిష్మా కపూర్ కరీనాకపూర్ జన్మించిన అనంతరం పలు విభేదాలతో వీరిద్దరూ విడిపోయారు. అయితే 1988లో విడిపోయిన ఈ జంట దాదాపు 35 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకటయ్యారు..

Kareena Kapoor slays in style at dad Randhir Kapoor's birthday | 103841

రాజ్ కపూర్ పెద్ద కుమారుడైన రణధీర్ కపూర్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటుడుగా, నిర్మాతగా రాణించారు. కొన్ని సినిమాలకి దర్శకత్వం సైతం వహించారు. ఇండస్ట్రీలో మంచి స్థాయిలో కొనసాగుతున్నప్పుడే సహా నటి బాబితాను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం బబితా సినిమాలకు దూరం అవ్వగా రణధీర్ మాత్రం హీరోగా కొనసాగారు. కాగా రన్ ధీర్ చాలా కాలం పాటు చెంబూర్ లో నివాసం ఉన్నారు. అనంతరం బాంద్రా కు షిఫ్ట్ అవ్వగా.. బాబితా భర్తతో కలిసి బాంద్రా ఇంటికి వచ్చేసారు.. ఇక బబితా 2007లోనే రణధీర్ తో కలిసి ఉందాం అని అనుకున్నారంట. కానీ కొన్ని కారణాలతో ఆ సమయంలో ఉండటం వీలు కాలేదు. భర్త నుంచి విడిపోయినప్పుడు బబిత తన ఇద్దరు కూతుర్లను తీసుకుని చెంబూర్‌లోని ఆర్కే బంగ్లా నుంచి బయటకు వచ్చేసింది. లోఖండ్‌వాలాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పిల్లలతో కలిసి ఉండేది.

 

కాగా బబితా, రణధీర్ విడిపోయిన అనంతరం కూడా ఎలాంటి గొడవలు పడలేదని తెలుస్తోంది. ఇన్నాళ్ళలో కపూర్ ఇంట్లో ఏ అవసరం వచ్చినా బబితా అందుబాటులో ఉంటూ సహాయం అందించేవారని తెలుస్తోంది. కాగా ఇన్నాళ్ల తర్వాత ఈ జంట కలవటం అందరికీ ఆనందాన్నిస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news