తెలంగాణ మరో విషాదం.. ప్రియుడు పట్టించుకోవడం లేదని బాలిక ఆత్మహత్య !

-

తెలంగాణ మరో విషాదం.. ప్రియుడి పట్టించుకోవడం లేదని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పియస్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, శ్రీనివాస్ నగర్ లో నివాసం ఉండే రెడ్డయ్య కు 15 సంవత్సరాల కూతురు ఉంది. స్దానికంగా ఉన్న సోమయ్య నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది.

ఈమెకు అదే పాఠశాలలో చదువుతున్న ఓ మైనర్ బాలుడితో ప్రేమ వ్యవహరం నడుస్తుంది. గత కొద్దిరోజుల నుండి బాలుడు మరో అమ్మాయితో తిరుగుతూ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని భావించిన బాలిక మనస్దాపానికి గురై ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహరమే బాలిక ఆత్మహత్యకు కారణంగా అందరూ భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version