మధ్యప్రదేశ్ లో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం చేస్తూ లైవ్ స్ట్రీమింగ్

-

మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఆమె స్నేహితులు ఇద్దరూ అత్యాచారం చేశారు. అంతేకాదు అత్యాచారాన్ని తమ మరో స్నేహితుడికి చూపించడానికి లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బాలికను హెచ్చరించారు. గత ఏడాది నుంచి ఆమెను బలవంతంగా అనుభవిస్తున్నారు. మరోవైపు ఇటీవల బాధితురాలికి ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది.

దీంతో అత్యాచార వీడియోను సదరు వ్యక్తికి వీరు పంపించారు. దాంతో వీరి పెళ్లి రద్దు అయింది. ఈ క్రమంలో తన కూతురికి జరిగిన అన్యాయంపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news