పాల పాకెట్ కోసం వెళ్ళింది.. ఇంతలోనే తిరిగిరాని లోకంలోకి వెళ్లిన చిన్నారి

-

ముద్దులు వొలికే చిట్టి తల్లి కోసం ఇంట్లో అమ్మ నాన్న ఎదురుచూస్తున్నారు. పాప పాల ప్యాకెట్ తెద్దామని బయటకు వెళ్ళింది. ఒక పక్క వాన పడి రోడ్లు అన్ని నీటితో నిండిపోయాయి. చిట్టితల్లి కోసం ఇంట్లో అందరు ఎదురుచూస్తున్నారు.కానీ కూతురు చనిపోయిందన్న వార్త విని ఆ తల్లితండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. వివరాలలోకి వెళితే… పాల ప్యాకెట్‌ కోసం వచ్చిన చిన్నారిని మురుగునీటి డ్రైన్‌ రూపంలో మృత్యువు కబళించింది. బాలికను కాపాడేందుకు పెద్ద ఎత్తున స్థానికులు డ్రైన్‌ లో గాలించినా ఫలితం లేకపోయింది.

kid
kid

పట్టణానికి చెందిన పలివెల దుర్గాప్రసాద్, పల్లవి దంపతులకు కుమార్తె చంద్రకళ(7), కుమారుడు ఉన్నారు. స్థానిక మూడో వార్డులోని ఇంటిలో అద్దెకు ఉంటున్న దుర్గాప్రసాద్‌ వడ్రంగి పని చేస్తుంటాడు. స్థానిక రామాహిందూ మున్సిపల్‌ స్కూల్లో చంద్రకళ రెండో తరగతి చదువుతోంది.ఆదివారం సాయంత్ర సమయంలో పాల ప్యాకెట్‌ కోసం పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని దుకాణం వద్దకు వచ్చింది.కానీ అప్పటికే విపరీతమైన వర్షం కురవడంతో డ్రైన్ లు అన్ని పొంగింపోర్లుతున్నాయి. వర్షం కారణంగా దుకాణం సమీపంలోని మంగళిబోదె డ్రైన్‌ వేగంగా ప్రవహిస్తోంది. రోడ్డుపై నుంచి మురుగు నీరు ప్రవహిస్తుండడంతో ఆ పాప యొక్క నీటిలో కాలి చెప్పు జారిపోయింది. దానిని తీసుకునే ప్రయత్నంలో చంద్రకళ నీటి ప్రవాహ వేగానికి డ్రైన్‌లో పడి కొట్టుకుపోయింది.

ఆ పాప తో వచ్చిన తోటి పిల్లలు చంద్రకళ నీళ్లలో కొట్టుకుపోవడం గమనించి బాలిక ఇంటికి వెళ్లి ఆమె తల్లికి చెప్పడంతో ఆమె పరుగెత్తుకుంటూ సంఘటన స్థలానికి చేరుకుంది. పాపం ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చి తన బిడ్డను కాపాడమంటూ ఆమె డ్రైన్‌ వెంబడి పరుగులు పెట్టడం చూసి స్థానికులు పెద్ద ఎత్తున డ్రైన్‌లోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. కిలోమీటరు దూరంలో చిన్నారి దొరకడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మున్సిపల్‌ కమిషనర్‌ టి.రామ్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.పాల పాకెట్ కి పాపని పంపించి తప్పు చేశామని ఆ తల్లితండ్రుల ఏడుపులు చూసి ఆసుపత్రి లో అంత విషాద ఛాయలు అలుముకున్నాయి…

Read more RELATED
Recommended to you

Latest news