లైట్ బీర్లు అందుబాటులో ఉంచాలని యువకుడి లేఖ

-

జిల్లాలోని వైన్స్ , బార్ అండ్ రెస్టారెంట్లలో కింగ్ ఫిషర్ బీర్లు దొరకడం లేదని కుట్రంగి తరుణ్ అనే యువకుడు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఎక్సైజ్ అధికారికి వినతిపత్రం అందజేశారు.తాగేందుకు లైట్ బీర్లు దొరకడం లేదు. అందుకే లైట్ బీర్లు అందుబాటులో ఉండేలా చూడాలని తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బీరు బాధితుల బాధలు తెలుసుకొని మంచిర్యాల ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరిండెంట్‌కు వినతి పత్రం అందించారు. జిల్లాలోని వైన్స్, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదని అందులో పేర్కొన్నారు… ఎండ తీవ్రతలు ఎక్కువ అవుతున్న కొద్దీ యువకులు, పెద్దలు బీరు దాహం తీర్చుకునేందుకు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

ఈ జిల్లాలోనే కాకుండా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో కూడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు లభ్యం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లైట్ బీర్లను తాగడం ద్వారా మత్తు తక్కువ సమయం ఉంటుందని, ఆ తర్వాత మా పనులను మేము చేసుకోగలుగుతామని తెలిపారు. స్ట్రాంగ్ బీర్లు తాగడం ద్వారా కడుపులో మంట, తీవ్రమైన తలనొప్పి, వాంతులు వంటివి వస్తున్నాయని చెప్పారు. మాకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడానికి మాకు కావాల్సిన కింగ్ ఫిషర్ బీర్లను జిల్లాలోని అన్ని వైన్ షాపులలో బార్లలో అందుబాటులో ఉండే విధంగా చేయగలరని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news