VIRAL : పాలు తాగుతున్న నంది విగ్రహం..పోటెత్తిన భక్తులు

-

దేవుడి విషయంలో ఎన్నో నమ్మేనివి వింటుంటాం. చూశాం కూడా. గణేశుడి విగ్రహం పాలు తాగడం, సాయిబాబా విభూతి రాల్చడం.. శ్రీరాముడి విగ్రహం కన్నీళ్లు పెట్టుకోవడం.. ఇలా ఎన్నో … ఎన్నో విచిత్ర సంఘటనలు మన కళ్లెదుటే జరిగాయి. ఇక తాజాగా నంది విగ్రహం.. ఏకంగా పాలు తాగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

 

ఈ అరుదైన సంఘటన కోమురం భీమ్‌ జిల్లా మొగుడ్‌ దగడ్‌ లోని హనుమాన్‌ దేవాలయంలో చోటు చేసుకుంది. ఆనోటా ఈ నోటా పాకి.. ఈ ముచ్చట … జనం చెవిలో పడటంతో.. ఈ వింత చూసేందుకు తరలి వచ్చారు భక్తులు. దీంతో ఆ గ్రామంతో సహా పక్క ఊరి ప్రజలు కూడా… ఆ నందికి పాలు పోశారు. అయితే.. ఎప్పుడూ లేనిది నంది పాలు తాగడం గమనించారు. ముందు షాక్‌ అయి… భగవంతుడి లీలా అనుకుని.. పాలు పోస్తున్నారు. గిన్నెలో పాలు నింది గుట గుటా తాగినట్లే కనిపిస్తోంది. నిజంగానే నందిపాలు తాగి ఉంటాడని.. దేవుడి మహిమ వల్ల ఇది సాధ్యమైందని చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version