కొడుకుకు ముద్దుపెట్టి బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత

-

మనీలాండరింగ్ చట్టం కింద కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలిస్తున్నారు.ఆమెను తరలిస్తున్న క్రమంలో భావోద్వేగానికి గురైన కవిత.. కొడుకు నుదుటిపై ముద్దు పెట్టి.. ముందుకు సాగారు. అంతకుముందు జై తెలంగాణ అని నినదించిన కల్వకుంట్ల కవిత… పిడికిలి బిగించి శ్రేణులకు అభివాదం చేశారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని.. చట్టంపై నమ్మకంతోనే ముందుకు సాగుతామని పేర్కొన్నారు.అనంతరం కారు ఎక్కాక భర్తను హత్తుకొని ఆమె ఉద్వేగానికి గురయ్యారు.

కాగా,ఇవాళ ఢిల్లీ నుండి వచ్చిన ఐటీ, ఈడీ అధికారుల బృందం హైదరాబాద్లోని ఆమె ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. దాదాపు 4 గంటల పాటు అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని విచారించారు. అనంతరం కోర్టు అనుమతితో కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news