సికింద్రాబాద్ లో దారుణం : నాలుగు రోజులు మహిళపై అత్యాచారం.. కిడ్నాప్ చేసి మరీ!

-

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో తనను కిడ్నాప్ చేసి నాలుగైదు రోజులు అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ చిలకల గూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఓ మహిళ వచ్చింది. తన బావ చికిత్స కోసం ఈ నెల 4వ తేదీన గాంధీలో చేరగా.. అక్కడ సిబ్బంది తనపై అత్యాచారం చేశారంటూ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది ఆ బాధిత మహిళ. తన అక్కను.. తనను గదిలో బంధించి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఆ బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.

తాను తప్పించుకుని బయటపడ్డానని, తన అక్క ఆచూకీ తెలియడం లేదంటూ ఆవేదన ఆవేదన వ్యక్తం చేసింది. మొదట మహబూబ్ నగర్ జిల్లా వన్ టౌన్ పి ఎస్ కు వెళ్లానని పేర్కొన్న ఆ మహిళ.. కొందరి సహాయంతో.. హైదరాబాద్ చిలకల గూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వచ్చానని స్పష్టం చేసింది ఆ మహిళ. ఉమ మహేశ్వర్ అనే గాంధీ ల్యాబ్ టెక్నీషియన్ తనను అత్యాచారం చేశాడని చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news