ఉపాసన ప్రసవం కోసం తరలివచ్చిన ప్రపంచ స్థాయి వైద్య బృందం..!

-

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె రామ్ చరణ్ భార్య మాత్రమే కాదు అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలుగా, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ గా, సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ సామాన్యులకు కూడా అండగా నిలుస్తోంది. ఇదిలా ఉండగా ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తన మొదటి బిడ్డను ఎక్కడ ప్రసవించనుందో స్వయంగా ఉపాసన ప్రకటించింది. ప్రస్తుతం ఆమె చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉపాసన ఆ ట్వీట్ లో ఏ బి సి అనే అమెరికన్ ఛానల్ హోస్ట్ ను ట్యాగ్ చేస్తూ… ఇండియా రావాలని కోరారు… గుడ్ మార్నింగ్ అమెరికా హోస్ట్ డాక్టర్ జెన్నీఫర్ ఆష్టన్ ను టాగ్ చేస్తూ మీరు ఇండియా రావాలని, ఇక్కడ ప్రపంచ స్థాయి హాస్పిటలే కాదు డాక్టర్స్ ఉన్నారని, మీరు, డాక్టర్ సుమనా మనోహర్ , డాక్టర్ రూమా సిన్హాలతో పాటు ఇతర డాక్టర్స్ తమ అపోలో హాస్పిటల్లో ఉన్నారని.. మా మొదటి బిడ్డ ప్రసవానికి మీరు రావాలని.. మీ తోడు ఉండాలి” అంటూ కోరారు యాంకర్ కం డాక్టర్ జెన్నీఫర్ కూడా కచ్చితంగా వస్తానంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

ఉపాసన సోషల్ మీడియాలో తరచుగా నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొంటుంది. ఈ విషయంపై కూడా ఆమె జోష్ స్టాక్ అనే యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ.. చాలా మంది నేను గోల్డెన్ , ప్లాటినం స్పూన్ తో పుట్టారని అంటారు.. అయితే నా తల్లిదండ్రులు ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు.. అంతేకాదు నేను రెస్ట్ లేకుండా వృత్తిపరమైన బాధ్యతలతో బిజీగా ఉన్నాను. నేను జస్ట్ ఖాళీగా ఉండొచ్చు.. కానీ అలా ఉండలేదు.. నాకు తెలిసు ఏం చేయాలో.. ఏం చేయకూడదు అంటూ మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news