Adallu Meeku Joharlu: “ఆడాళ్లు మీకు జోహార్లు” అంటున్న శ‌ర్వా .. ఫ‌స్ట్ లూక్ అదుర్స్!

-

Adallu Meeku Joharlu: నేను… శైలజ’ తో క్లాసిక‌ల్ హిట్ అందుకున్న డైరెక్ట‌ర్ కిశోర్‌ తిరుమల. ఇప్పుడు శ‌ర్వానంద్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు. శర్వాతో ‘పడి పడి లేచె మనసు’ చిత్రాన్ని నిర్మించిన సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మించనున్నారు.

ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ వ‌చ్చింది. ఈ రోజు ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ఆడాళ్లు మీకు జోహార్లు చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ప్రేక్ష‌కుల‌కు దసరా శుభాకాంక్షలు చెబుతూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా.. గుమ్మానికి పూల తోరణాలు కట్టేశారు. ఈ పోస్ట‌ర్లో రష్మిక, శర్వా లు చూడ చ‌క్క‌గా ఉన్నారు. అచ్చు తెలుగింటి ఆడపిల్ల ర‌ష్మిక క‌నిపిస్తుంది. పక్కింటి అమ్మాయిని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ పోస్ట‌ర్ క‌న్నుల విందుగా ఉంది.

తొలుత వెంకటేశ్‌ని హీరోగా అనుకున్నప్పటికీ… శర్వానంద్‌ శైలికి తగ్గట్టు కథ, స్క్రీన్ ప్లే, సీన్లలో మార్పులు చేశారట. ఇక .. జాను, శ్రీకారం, మ‌హా స‌ముద్రం సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైన శర్వానంద్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. చిత్రంలో కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news