Mahesh Babu: ఆ డైరెక్ట‌ర్ తో మ‌హేష్ పాన్ ఇండియా మూవీ.. బాలీవుడ్ ఏంట్రీకి ఇదే స‌రైన స‌మ‌యమట‌..

-

Mahesh Babu: తెలుగు సినిమా రూపురేఖ‌ల‌ను మార్చిన జ‌క్క‌న‌. తెరపై అన్ని ర‌సాల‌ను స‌మ‌పాళ్ల‌లో పంచే డైరెక్ట‌ర్. మాస్, క్లాస్ అన్నింటినీ వర్ ఫుల్ గా ప్రజెంట్ చేసే.. సౌత్ ఇండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్​ రాజమౌళి. బ‌హుబ‌లి సిరీస్ తో తెలుగు చ‌ల‌న చిత్ర స్థాయిని ప్ర‌పంచవ్యాప్తం చేశారు.

ఆయ‌నలో ప‌నిచేందుకు ప్ర‌తి హీరో క్యూ క‌డుతారు. ఇప్పుడూ తాజాగా ప్రిన్స్ మ‌హేశ్ బాబు కూడా క‌లిసి ప‌నిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపిన‌ట్టు తెలుస్తుంది. తాజాగా ఫోర్బ్స్​ ఇండియా ఇంటర్వ్యూలో ఈ విష‌యాన్ని క్లారిటీ ఇచ్చేశారు.

మ‌హేశ్ బాబు తన తదుపరి ప్రాజెక్స్ గురించి ఆసక్తికర విషయాలను వెల్ల‌డించారు. తానెప్పుడూ సరైన సమయంలో సరైన సినిమాలే చేస్తానని, బాలీవుడ్ లో ఏంట్రీ ఇవ్వ‌డానికి రాజమౌళితో పాన్ ఇండియా చేయ‌డానికి సిద్దంగా ఉన్నాను. ఈ చిత్రం అన్ని భాషల్లో ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇక మ‌హేశ్, రాజ‌మౌళిల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ మూవీకి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. మరి మహేష్ బాబు కోసం రాజమౌళి ఫైనల్‌గా ఎలాంటి కథను ఓకే చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news