ఆధార్ తో పాన్ కార్డు లింక్ చేశారా ? లేదా ?.. చేయకుంటే 10 వేల ఫైన్ !

-

పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవడానికి విధించిన చివరి తేదీని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం 2021 మార్చి 31వ తేదీ చివరి తేదీగా నిర్ణయించింది. నిజానికి ఈ లింక్ చేయడానికి సంబంధించిన చివరి తేదీని 2020 జూన్ 30 వరకు నిర్ణయించింది. కానీ ఈ తేదీని ఈ నెల చివరి వరకూ అప్పట్లోనే పొడిగించింది. ఇప్పటివరకు ఎవరైనా పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోలేదో, వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు. లేదంటే పది వేల జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక ఈ లింక్ పూర్తి కాకపోతే భవిష్యత్తులో పాన్ కార్డు అవసరమయ్యే దగ్గర ట్రాన్సాక్షన్స్ అందుబాటులో ఉండవని అంటున్నారు.

aadhar and pancard
aadhar and pancard

బ్యాంకు ట్రాన్సాక్షన్ లో పాన్ కార్డు అవసరం చాలా ఉంటుంది. ఖాతా ఓపెన్ చేయడానికి గానీ, పరిమితికి మించి డబ్బు జమ చేయాలన్నా, తీసుకోవాలన్నా పాన్ కార్డ్ కంపల్సరీ. పాన్ కార్డుతో ఆధార్ కార్డ్ లింక్ చేసుకోకపోతే ఇలాంటి సదుపాయాలకి భంగం కలుగుతుంది. ఇక ఆధార్ తో లింక్ చేసారా లేదా అని తెలుసుకోవడానికి ఈ వెబ్ సైట్ www.incometaxindiaefiling.gov.in లోకి లాగ్ ఇన్ అయితే తెలిసిపోతుంది. లాగ్ ఇన్ అయ్యాక మీ పాన్ కార్డుతో ఆధార్ లింక్ లేదని తెలిస్తే, అక్కడ ఒక ఫామ్ ఉంటుంది. దానిలో ఉన్న వివరాలన్నింటినీ పూర్తి చేస్తే పాన్ కార్డుతో ఆధార్ లింక్ అయిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news