ట‌ర్కీ ప్రథమ మ‌హిళ‌ను కలిసిన అమీర్ ఖాన్..!

-

బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ తాజాగా ‘లాల్ సింగ్ చ‌ద్దా’ చిత్రం షూటింగ్ కోసం ట‌ర్కీకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయ‌న టర్కీ ప్రథమ మహిళ ఎమిన్ ఎర్డోగాన్‌ను క‌లిసారు. అమీర్‌తో క‌లిసి ముచ్చ‌టిస్తున్న ఫోటోల‌ని ఎమిన్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. ‘ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత భారతీయ న‌టుడు అమీర్ ఖాన్‌ని ఇస్తాంబుల్‌లో క‌ల‌వ‌డం సంతోషంగా ఉంది.’ అంటూ ఎమిన్ ఎర్డోగాన్‌ ట్వీట్ చేశారు. అలాగే తన సినిమాల్లో సామాజిక సమస్యలను ధైర్యంగా నిర్వహించినందుకు ఆమె అభినందించారని అమీర్ ఖాన్ చెప్పారు.

కాగా, అద్వైత్‌చందన్‌ దర్శకత్వంలో వస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే 50 శాతం పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కు జంటగా క‌రీనా క‌పూర్ నటిస్తున్నారు. టామ్‌హాంక్స్‌ కథానాయకుడిగా 1994 వచ్చిన హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు సమాచారం. అయితే ఈ సినిమా కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నాను అంటూ త‌న ట్వీట్‌లో పేర్కొంది ఎర్డోగాన్‌.

Read more RELATED
Recommended to you

Latest news