మమతా బెనర్జీ అల్లుడి కాన్వాయ్ పై దాడి

-

టి ఎం సి అధినేత, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్లుడు టిఎంసి పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్ పై దాడి జరిగింది. ఈ ఘటన ఇవాళ సాయంత్రం సమయంలో చోటు చేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… టి.ఎం.సి ఎంపీ అభిషేక్ బెనర్జీ… సోమవారం త్రిపుర అగర్తల లో పర్యటించారు.

ఈ క్రమంలో ఆయన కాన్వాయ్ పై కొందరు వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన నుంచి అభిషేక్ బెనర్జీ తృటిలో తప్పించుకున్నారు. బీజేపీ నేతలే కావాలని తనపై దాడి చేయించారని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. ఈ మేరకు అభిషేక్ బెనర్జీ తన ట్విట్టర్ వేదికగా బీజేపీపై మండిపడ్డారు. “బిజెపి నాయకత్వంలోని త్రిపురా లో ప్రజాస్వామ్యం ఇలా ఉంది. విప్లవ దేవ్ మీరు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు మిమ్మల్ని అభినందిస్తున్నాను” అంటూ తన కాన్వాయ్ పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. త్రిపురాలో దారుణ పరిస్తుతులు ఉన్నాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news