పేరు లేకపోవడం మహదానందంగా ఉంది : మండలి బుద్ధ ప్రసాద్

-

మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వివిధ పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ 7 జాబితాలను విడుదల చేయగా తాజాగా ప్రతిపక్ష టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను చేసింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను, జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు మొత్తం ఫస్ట్ లిస్ట్ లో మొత్తం118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

ఇక  ప్రతిపక్ష టిడిపి జనసేన కూటమి తొలి లిస్టులో అవనిగడ్డ నుంచి తన పేరు ప్రకటించనందుకు మహదానందంగా ఉన్నానని టీడీపీ నేత, మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ‘పంజరం నుంచి బయటికొచ్చిన స్వేచ్ఛా పక్షిలా ఉన్నా. మన కళ్ల ముందే రాజకీయాలు మారిపోయాయి. డబ్బే ప్రధానమైంది. ఓటరును కొనుగోలు వస్తువుగా రాజకీయపక్షాలు భావిస్తున్న తరుణంలో నాలాంటి వాడు ఎన్నికల్లో నిలబడాలని భావించడం సమంజసం కాదు’ అని కార్యకర్తలకు వాట్సాప్ మెసేజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version