హైదరాబాద్ – సాగర్ హైవే మీద ఘోర రోడ్డు ప్రమాదం

-

హైద్రాబాద్, సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా చింత పల్లి మండలం వింజమూరు సమీపంలో అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరిని తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు.

హైద్రాబాద్ నుంచి మల్లేపల్లి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద అదుపుతప్పి కారు బోల్తా పడింది. రోడ్డు వెంబడి ఉన్న హెచ్ఎండబ్లూఎస్ వాటర్ ఫిల్లర్ ను ఢీ కొట్టి బోల్తా పడినట్టు గుర్తించారు. మృతులంతా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన యువకులుగా గుర్తించారు. అతికష్టం మీద మృతదేహాలను పోలీసులు, స్థానికులు బయటకు తీస్తున్నారు. నిద్రమత్తు, అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news