ప్రాణం తీసిన వాట్సాప్ ఫోటో…!

-

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు ఎన్ని రైడ్స్ చేసినా పేకాట ఆగడం లేదు. రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో పేకాట పెద్ద ఎత్తున ఆడుతున్నారు కొందరు. ఇటీవల కర్నూలు జిల్లాలో ఈ పేకాట వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. కృష్ణాజిల్లా కంచికచెర్ల మండలం పరిటాల లొ దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం పేకాట శిబిరాల పోలీసులు దాడులు చేసారు.WhatsApp

ఈ దాడి లో అరెస్టు చేసిన వ్యక్తి ని విడిపించడాని కి టిడిపి నాయకుడు ఒకరు వచ్చారు. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఆ లీడర్ ను పొగుడుతూ వాట్సాప్ లో ఫోటో పెట్టాడు. పోటో పెట్టడం తో ,పోలీసులు పిలిచి అతనిపై దాడి చేసారట. ఈ విషయాన్ని అతని బంధువులు మీడియాకు వివరించారు. దానితో మనస్తాపం చెందిన రాజశేఖర్ రాత్రి విజయవాడ వెళ్లి కృష్ణా నది లొ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news