పెళ్లికూతురును తీసుకువెళ్తుండగా రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

-

ప్రకాశం జిల్లా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళుతున్న ఆటో నుంచి జారిపడి ఏకంగా నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరికొందరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా…. మార్గమధ్యంలో మరో ఇద్దరు మృతి చెందారు.

మృతులను కనకం కార్తీక్, అనీల్, భోగం సుబ్బారావు మరియు శ్రీను గా గుర్తించారు. వివాహ వేడుక కు వధువును తీసుకొని త్రిపురాంతకం మండలం సోము పల్లి నుంచి పొదిలి అక్కచెరువు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పెళ్లికూతురు ఆటో ముందు భాగంలో కూర్చోవడంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇక ఆ క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఇక ఈ ఘటన సమాచారం తెలియగానే.. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నారు పోలీసులు.  ఇక అటు వధువు సహా కుటుంబసభ్యులంతా విషాదంలోకి వెళ్లారు.

Read more RELATED
Recommended to you

Latest news