టూ లెట్‌ బోర్డు పెట్టినా జరిమానా..! : జీహెచ్‌ఎంసీ కీలక ప్రకటన

-

హైదరాబాద్ లో టూ లెట్ బోర్డులకు జరిమానాల పై జిహెచ్ఎంసీ క్లారిటీ ఇచ్చింది. ఈవీడీఎం కింద సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ ఆధ్వర్యంలో అనధికార బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, కట్ ఔట్లు, వాల్ రైటింగ్ల కు జరిమానా విధిస్తామని పేర్కొంది. సొంత ఇంటికి టూ లెట్ బోర్డు పెట్టినా ఫైన్ అని వచ్చిన వార్తలను ఖండించింది జిహెచ్ఎంసీ.

కేవలం కమర్షియల్ బిజినెస్ ఏజెంట్స్, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్స్ వాళ్లు పబ్లిక్ ప్రదేశాల్లో అంటిస్తున్న పోస్టర్లకు మాత్రమే జరిమానా విధిస్తున్నామని క్లారిటీ ఇచ్చింది జిహెచ్ఎంసీ. వ్యక్తిగతంగా ఎవరి ఇంటికి వారు పెట్టుకునే టూ లెట్ బోర్డులకు ఫైన్ లేదని వెల్లడించింది. పబ్లిక్ ప్రదేశాల్లో టూ లెట్, కోచింగ్, రియల్ ఎస్టేట్, పాన్ కార్డు చేస్తాం అంటూ వెలిసిన కొన్ని ప్రచార పోస్టర్లకు జరిమానా విధించిన జిహెచ్ఎంసీ.. వ్యక్తిగత ఇంటికి పెట్టిన టూ లెట్ బోర్డుకు ఫైన్ విధిస్తే తమ దృష్టికి తేవాలని వాటిని సరిదిద్దుతామని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news