రాజేంద్ర‌న‌గ‌ర్ ఘోర ప్రమాదం.. పరీక్ష వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి

-

హైదరాబాద్‌ లోని రాజేంద్ర నగర్‌ లో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్ర నగర్‌ లోని గండిపేట సీబీఐటి రోడ్డులో విద్యుత్ స్థంభాన్ని ఢీ కొట్టుకుని ఇద్దరు విద్యార్థుల దుర్మరణం చెందారు. ఇక ఈ ప్రమాదంలో మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. గండిపేట నుండి నార్సింగ్ వైపు ఒక కారు వెళుతోంది. అయితే ఆ కారులో ఐదు మంది విద్యార్థులు ఉన్నారు.

కారు వెళ్లే దారిలో ఆటో ఒక్కసారిగా అడ్డు వచ్చింది. దీంతో ఆ ఆటోను తప్పించబోయి కరెంటు స్తంభానికి ఢీ కొట్టింది విద్యార్థులు కారు. దీంతో ఘటన స్థలంలోనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కౌశిక్, జో డౌన్ అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్టు తెలుస్తోంది. క్షతగాత్రయలను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఇక స్థానికుల సమాచారం తో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news