వరంగల్ లో దారుణం.. ఫ్రిజ్ లో వృద్ధుడి మృతదేహం.. మనవడి పైనే అనుమానం.. !

-

వరంగల్ జిల్లా పరకాల లో దారుణం చోటుచేసుకుంది. ఓ రిటైర్డ్ ఉద్యోగి మృతదేహం 15 రోజుల నుండి ఫ్రిజ్ లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటనపై ఏసిపి శివరామయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే… పరకాలలో రిటైర్డ్ ఉద్యోగి..వృద్దుడు బైరం బాలయ్య మృతదేహం ఫ్రిజ్ లో ఉండటం స్థానికంగా కలకలం రేపింది. అయితే బాలయ్యను ఆయన మనవడు నిఖిల్ హత్య చేసి ఫ్రిజ్ లో పెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

crime scene in wrandal
crime scene in wrandal

కానీ ఈ విషయంపై నిఖిల్ ను ప్రశ్నించగా అతడి సమాధానం మాత్రం మరోలా ఉంది. రెండు రోజుల క్రితం తన తాతయ్య చనిపోయాడని అంత్యక్రియలు నిర్వహించేందుకు తన వద్ద డబ్బులు లేకపోవడంతో మృతదేహాన్ని ఫ్రిజ్ లో ఉంచినట్టు చెబుతున్నాడు. దాంతో నిఖిల్ తన తాతయ్య ను హతమార్చి ఫ్రిజ్ లో పెట్టాడా…. లేదంటే ఆర్థిక సమస్యల వల్లే మృతదేహాన్ని ఫ్రిజ్ లో భద్రపరచి వుంచాడా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news