షామీర్‌ పేట్ లో ఘోర ప్రమాదం..స్పోర్ట్‌ బైక్‌ ఢీకొట్టి ఒకరు మృతి

-

మేడ్చల్‌ జిల్లా శామీర్‌ పేట బస్టాండ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహన దారుడి ఏమర పాటు… మరో ఓ స్పోర్ట్స్‌ బైక్‌ వ్యక్తి అతి వేగం ప్రమాదానికి కారణమయ్యాయి. ఓ వాహన దారుడు వెనుక వైపు చూసుకో కుండానే రోడ్డెక్కి యూటర్న్‌ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యం లో అతి వేగంగా వస్తున్న మరో స్పోర్ట్స్‌ బైక్‌ వ్యక్తి అది గమనించే అవకాశం లేకుండా పోయింది.

అదే వేగంతో ఉన్నట్టుండి రోడ్డు పైకి వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ఘోర ప్రమాదం లో రెండు వాహనాలు తుక్కు తుక్కయ్యాయి. ఈ ఘటన లో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక ఈ ప్రమాద దృశ్యాలు రహదారి పై ఏర్పాటు చేసిన సీసీ కెమెరా లో నమోదయ్యాయి. అయితే…. ఈ ఘటన విషయం తెలియ గానే పోలీసులు అక్కడి కి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news