పులివర్తి నానిపై దాడి కేసులో నిందితులకు రిమాండ్

-

చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి ఘటనలో ప్రధాన నిందితులు భానుకుమార్‌రెడ్డి, గణపతి రెడ్డితోపాటు మరో 11 మందిని అరెస్ట్‌ చేశారు. తిరుపతి ఏడీజే కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో మొత్తం 13మందిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా వారందరికీ 14 రోజులు రిమాండ్ విధించింది.

అనంతరం నిందితులందరినీ పోలీసులు చిత్తూరు సబ్‌జైలుకు తరలించారు. మంగళవారం మధ్యాహ్నం పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ పరిశీలనకు వెళ్లగా.. నానిపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో నానితో సహా ఆయన భద్రతా సిబ్బందికి గాయాలవ్వగా, కారు ధ్వంసమైంది.

Read more RELATED
Recommended to you

Latest news