కలెక్టర్లా ? వైసీపీ కార్యకర్తలా ?: అచ్చెన్నాయుడు

-

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలలో చాలా వ్యతిరేకత వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతసేపు ప్రభుత్వాన్ని, అధికార యంత్రంగాన్ని తిట్టడమే కాని… మేము ప్రజలకు ఇది చేస్తాము అంటూ చెప్పుకోవడం లేదంటూ కథలు కథలుగా ప్రజలు చెప్పుకుంటున్నారు. తాజాగా అచ్చెన్నాయుడు జిల్లా ప్రధాన పౌరుడు అయిన కలెక్టర్లపై విమర్శలు చేయడం ప్రజల్లో మరింత చులకభావం ఏర్పడేలా చేస్తోంది అని చెప్పాలి. ఈయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార పార్టీ తమకు వ్యతిరేకంగా అవుతాయి అనుకున్న ఓట్లను తొలగించే పని పెట్టుకుంది, ఈ విషయం పై మేము ఎన్ని ఫిర్యాదులు ఇస్తున్నా శ్రీకాకుళం, కోనసీమ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల కలెక్టర్లు మా ఫిర్యాదులను పట్టించుకోవడం లేదంటూ మళ్లాడారు అచ్చెన్నాయుడు.. వీరు కలెక్టర్లా లేదా వైసీపీ కార్యకర్తలా అంటూ మండిపడ్డారు అచ్చెన్నాయుడు.

ఎంతసేపు వారిపై వీరిపై విమర్శలు చేయడమే కాని, మనము ఏమి చేయకపోతే మనల్ని ప్రజలు ఓడించారు అని ఆలోచించుకోవడం లేదు టీడీపీ అంటూ కొందరు అంటున్నారు

Read more RELATED
Recommended to you

Latest news