ఇండియా, పాక్ లవర్స్ స్టోరీ లో భారీ ట్విస్ట్ !

-

ఈ మధ్యన జరుగుతున్న చాలా పెళ్లి తర్వాత మళ్ళీ ప్రేమ పెళ్లిళ్లలో ట్విస్ట్ లు ఉంటున్నాయి. తాజాగా ఇండియా మరియు పాకిస్తాన్ కు చెందిన వారి లవ్ స్టోరీ మరియు పెళ్లి కథలో ఇప్పుడు భారీ ట్విస్ట్ ఒక్కటి బయటపడింది. ఇండియా లోని రాజస్థాన్ కు చెందిన అంజూ అనే వివాహిత పేస్ బుక్ లో పరిచయం అయిన పాకిస్తాన్ కు చెందిన నస్రుల్లా ను ఎక్కువగా ప్రేమించేసి అతని కోసం ఏకంగా అయిదు నెలల క్రితం పాకిస్తాన్ కు వెళ్లిపోయింది. అక్కడ కొన్ని రోజుల తర్వాత అంజూ ఇస్లాం మతంలోకి మారిపోయి పాతిమాగా మారి ఇతన్ని పెళ్లి చేసుకుంది. కానీ తాజాగా ఆమెకు ఇండియాలో ఉన్న తన పిల్లలపై మనసు మళ్లింది.. దీనితో ఏమాత్రం ఆలోచించకుండా భర్తను అక్కడే వదిలి ఇండియాకు తిరిగి వచ్చేసింది అంజూ.

అయితే ఇండియాలో ఈమెను విచారణ చేసిన తర్వాతనే పిల్లలను చూడడానికి అనుమతి ఇస్తామంటూ అధికారులు ఈమెకు ట్విస్ట్ ఇవ్వడం గమనార్హం. మరి ముందు ముందు అంజూ కేసులో ఏమి జరగనుంది అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news