మెగాఫోన్ పట్టనున్న హీరోయిన్ కల్యాణి…

-

నవ్వవయ్య బాబూ అంటూ..ఒకప్పుడు తెలుగువారికి పరిచయమైన హీరోయిన్ కల్యాణి. జౌను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, పెదబాబు, దొంగోడు, వసంతం వంటి హిట్ చిత్రాలతో కల్యాణి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత అడపా దడపా సినిమాల్లో నటించినా కల్యాణి కెరీర్ కు అంతగా బ్రేక్ రాలేదు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కల్యాణి తన లక్ ను టెస్ట్ చేసుకున్నారు. అయినా అంతగా సక్సెస్ అందుకోలేదు కల్యాణి.

ఇప్పుడు డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టుకుని తన సెకండ్ ఇన్నింగ్స్ ను టెస్ట్ చేసుకోవడానికి రెడీ అయ్యారు కల్యాణి.అవును ఓ చిత్రానికి ఆమె దర్శకత్వం వహించనున్నారు. KK ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చేతన్ శీను హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ప్రీలుక్ ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్ంనాథ్ విడుదల చేశారు.

తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి కల్యాణి దర్శకత్వం వహిస్తున్నారని తెలిసిన నెటిజన్లు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో కావేరీ కల్యాణి ఎంత వరీకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news