మత్తుమందు తినిపించి, నటి సోనాల్ ఫోగట్ పై మూడేళ్లుగా లైంగిక దాడి ?

-

బాలీవుడ్‌ స్టార్‌ సోనాల్ ఫోగట్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. సోనాల్ ఫోగట్ మరణం పై అనుమానాల నేపథ్యంలో తీవ్ర ప్రకటనలు ఇస్తోంది ఆమె కుటుంబం. తాజాగా సోదరుడు రింకుదాకా సంచలన ఆరోపణలకు దిగాడు. ఆమెపై ఏళ్ల తరబడి అత్యాచారం జరుగుతోందని, ఆస్తి కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నాడు.

అతను సోనాల్ ఫోగట్, పిఏ సుధీర్ సంగ్వాన్, అతని స్నేహితుడు సుక్వీందర్ లు కలిసి ఆమెకు గత మూడేళ్లుగా మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చే వాళ్ళని, ఆమెపై ఇంట్లో అఘాయిత్యానికి పాల్పడి వీడియో తీసే వాళ్ళని, వాటి ఆధారంగా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి లోబర్చుకున్నారని రింకు చెబుతున్నాడు. సినీ, రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని సోనాలిని వాళ్ళిద్దరూ బెదిరించేవారని, డబ్బు, ఇతర సౌకర్యాలను అనుభవించే వాళ్ళని, పరువు పోతుందనే భయంతోనే ఆమె ఇంతకాలం మౌనంగా ఉండిపోయిందని రింకు పోలీసులకు తెలిపాడు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news