వాకీ, టాకీలతో పాదయాత్ర చేసేవారు రైతులా ? – ఆదిమూలపు సురేష్‌

-

వాకీ, టాకీలతో పాదయాత్ర చేసేవారు రైతులా ? అని ఆదిమూలపు సురేష్‌ అమరావతి రైతులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పై వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని.. నా నియోజకవర్గంలో ఎటువంటి గ్రూప్ తగాదాలు లేవు.. నాకు సమాచారం ఇచ్చే నాయకులు, కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకున్నారన్నారు.

రైతుల పాదయాత్రకు అర్థం లేదు.. ల్యాండ్ పూలింగ్ రైతులకు గత ప్రభుత్వం కంటే మేమే ఎక్కువ చేశామని పేర్కొన్నారు. అమరావతి షట్ డౌన్ చే స్తున్నట్లు టీడీపీ ప్రచారం చేస్తోందని.. అమరావతి అభివృద్ధి పనులు కొనసాగుతోందని వెల్లడించారు.

60 వేల రిటర్న్‌బుల్ ప్లాట్స్‌లో 40 వేల ప్లాట్స్‌ను రిజిస్ట్రేషన్ చే శామని.. కోర్టుకు వెళ్ళి అడ్డుకుంది ఎవరు?? అని నిలదీశారు. వాకీ టాకీలతో పాదయాత్ర చేసేవారు రైతులా?? 29 గ్రామాల అభివృద్ధి కోసం లక్షల కోట్లు పెట్టాలంటే ఎలా సాధ్యం అవుతుంది?? అని ఆగ్రహించారు. రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని నిప్పులు చెరిగారు ఆదిమూలపు సురేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news