అధ్యక్ష బరి నుంచి థరూర్ తప్పుకుని ఖర్గేకు మద్దతివ్వాలి : భట్టి విక్రమార్క

-

ఏఐసీసీ అధ్యక్ష బరిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. బరిలో ఉన్న మరో సీనియర్ నేత శశిథరూర్ తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరారు. థరూర్ ఖర్గేకు మద్దతు ప్రకటించాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

ఖర్గే పేరు తెరమీదకు రావడంతో బీజేపీ నేతలకు భయం పట్టుకుందని భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీకి వంత పాడుతున్న మీడియా ద్వారా ఖర్గేపై విషపూరిత ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఖర్గేను ఒక కులానికి పరిమితం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. అపారమైన రాజకీయ అనుభవం, పరిపాలన దక్షత, కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయత కలిగిన గాంధేయవాది అయిన ఖర్గే చరిత్రను తెలుసుకొని విష ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

ఏఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసిన మల్లిఖార్జున ఖర్గే అపార అనుభవం కలిగిన నాయకుడని భట్టి విక్రమార్క కొనియాడారు. ఆయనను గెలిపించేందుకు దేశంలోని కాంగ్రెస్‌ నాయకులందరు సహకరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news