పుట్ట మధు నోరు తెరిస్తే పరిస్థితి ఏంటీ…?

-

తెలంగాణాలో న్యాయవాది దంపతులు వామనరావు హత్య కేసు విషయంలో ఇప్పుడు కాస్త ఆసక్తికర చర్యలు చోటు చేసుకుంటున్నాయి. పుట్ట మధుని అరెస్ట్ చేసిన తర్వాత ఎవరు బయటకు వస్తారు ఏంటీ అనే దానిపై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. న్యాయవాది వామాన్ రావు తండ్రి కిషన్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. పుట్ట మధు దంపతులను సరైన పద్దతిలో విచారించాలి అని ఆయన డిమాండ్ చేసారు.

గట్టిగా విచారిస్తే.. వాస్తవాలు బయటకు వస్తాయి అన్నారు. నా కొడుకు, కోడలు హత్య కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయి అని, పుట్ట మధు దంపతులకు కఠిన శిక్ష పడాలి అని డిమాండ్ చేసారు. పుట్ట మధు నోరు విప్పితే అందరూ బయటకు వస్తారు అని అన్నారు. ఇది ముమ్మాటికీ పుట్ట మధు చేయించిన హత్యే అని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news