అక్రమ సంబంధమే ప్రాణం తీసింది..!

-

తాజాగా ఒక సంఘటన చోటుచేసుకుంది గత 15వ తేదీ సోమవారం సంక్రాంతి పండుగను వికారాబాద్ మండల పరిధిలో ఒక గుర్తు తెలియని మహిళని దారుణంగా హత్య చేసి తర్వాత పెట్రోల్ పోసి కాల్చేశారు. వికారాబాద్ పోలీసులు కేసును ఛేదించారు. అక్రమ సంబంధం అనుమానమే హత్యకు దారితీస్తుందని తెలుస్తోంది. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు శుక్రవారం వికారాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. సంక్రాంతి పండుగ నాడు అటవీ ప్రాంతంలో సగం కాలిపోయిన గుర్తుతెలియని మహిళా మృతదేహం ఉందని గ్రామ సర్పంచ్ పోలీసులకి సమాచారాన్ని ఇచ్చారు. సంఘటన స్థలానికి వెళ్ళిన పోలీసులు కేసును నమోదు చేశారు.

నేరస్థుడు ఆవుసుపల్లి బాబుపై మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తపరిచారు మృతురాలు ఎర్రోళ్ల అనుసుజా చేవెళ్లలో ఉంటోంది. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. గత ఐదేళ్ల క్రితం భర్త నరసింహులు చనిపోవడంతో లేబర్ అడ్డ మీద పనిచేసే తలారి బాబు అలియాస్ ఆవుసుపల్లి బాబుతో పరిచయం ఏర్పడింది. అక్రమ సంబంధం గా మారింది. నాలుగేళ్ల నుండి అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు ఆమె దూరం పెట్టిందని ఆమెని చంపేసి బాడీని తగలపెట్టేసాడు ఇదివరకు కూడా ఒక మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది

Read more RELATED
Recommended to you

Latest news