హైదరాబాద్‌ మెట్రోలో అఖిల్‌ అక్కినేని.. ఫోటో వైరల్‌

-

టాలీవుడ్ మన్మథుడుగా పేరు తెచ్చుకున్న అక్కినేని నటవారసుడు నాగార్జున తనయుడు అఖిల్(akhil) గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇన్ని రోజులూ ఈ యంగ్ హీరో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ హీరోకు ఇంత వరకు కెరీర్ లో సరైన హిట్ పడలేదు. అఖిల్ అక్కినేని చివరిసారిగా బొమ్మరిల్లు భాస్కర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌”లో కనిపించాడు.

ఈ మూవీ పర్వలేదనిపిచ్చింది. ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ కోసం పరితపించి భంగపడ్డ ఈ హీరో ప్రస్తుతం విలక్షణ దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి “ఏజెంట్” అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో అఖిల్ క్యారెక్టరైజేషన్ భిన్నంగా ఉండనుందని సమాచారం.

సురేందర్ రెడ్డి సినిమాలంటేనే హీరోల గెటప్ పూర్తిగా మార్చేస్తాడని టాక్ ఉంది. గతంలో ఆయనతో సినిమాలు చేసిన మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల గెటప్ లను గుర్తు పట్టలేకుండా మార్చేసి కొత్తగా ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు యంగ్ హీరో అఖిల్ ను కూడా అలాగే మార్చేసేందుకు కంకణం కట్టుకున్నాడు.అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఆ ఫోటో వైరల్ గా మారింది. హైదరాబాద్ మెట్రో రైలులో అక్కినేని అఖిల్… ప్రయాణిస్తున్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఏజెంట్ మూవీ షూటింగ్ లో భాగంగానే అక్కినేని అఖిల్ మెట్రో ఎక్కినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news