కేన్స్ లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫొటోలు వైరల్..!

-

ఫ్రాన్స్ లోని  ఫ్రెంచ్ రివేరాలో ప్రతిష్టాత్మక 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. మే 14న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆరంభం కాగా.. ఫ్యాషన్ ప్రియులు, అభిమానులు మాత్రం ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్య బ్లాక్, వైట్, గోల్డెన్ కాంబినేషన్లో ఉన్న గౌనులో రెడ్ కార్పెట్ పై నడిచారు. చేతికి గాయం ఉన్నా.. దాన్ని కనబడనీయకుండా తన డ్రెస్ ఫ్యాషన్తో కవర్ చేశారు.

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య రాయ్ డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. తన దుస్తులతో ప్రేక్షకులను మెన్నరైక్చేయడంలో ఐష్ మరోసారి సక్సెస్ అయ్యారు. ఐశ్వర్యను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. ప్రముఖ డిజైనర్ ఫల్గుణి షేన్ పీకాక్ డిజైన్ చేసిన డ్రెస్ను ప్రపంచ సుందరి ధరించారు. ఐష్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్య రెడ్ కార్పెట్ పై నడవడం ఇది 21వ సారి. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్క హాజరయ్యేందుకు తాజాగా ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ఫ్రెంచ్ రివేరా చేరుకున్నారు. ఐశ్వర్యకు గాయం అవ్వడంతో ఆరాధ్య తన తల్లికి సహాయం చేస్తున్నారు. అందుకు సంభవించిన వీడియోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news