యూపీ ఎన్నిక‌ల్లో అఖిలేష్ పోటీకి రెడీ.. నియోజ‌క వ‌ర్గం ప్ర‌క‌ట‌న‌

-

వ‌చ్చె నెలలో ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగే జ‌న‌ర‌ల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స‌మాజ్ వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్ ఎమ్మెల్యే గా పోటీకి సిద్ధం అవుతున్నారు. అంతే కాకుండా ఈ రోజు అఖిలేష్ యాద‌వ్ ఎమ్మెల్యే గా పోటీ చేసే నియోజ‌క వ‌ర్గాన్ని కూడా స‌మాజ్ వాదీ పార్టీ నాయ‌కులు వెల్ల‌డించారు. యూపీ లోని మెయిన్ పురి లో గ‌ల క‌ర్హాల్ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గం నుంచి స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ పోటీ చేస్తార‌ని ఆ పార్టీ నాయ‌కులు వెల్ల‌డించారు.

కాగ గ‌తంలో తాను ఎమ్మెల్యే గా పోటీ చేయ‌న‌ని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ ప్ర‌క‌టించారు. అఖిలేష్ యాద‌వ్ ఈ ప్ర‌క‌ట‌న చేసిన కొద్ది రోజుల త‌ర్వాతే.. తాను ఈ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తాన‌ని స్వ‌యంగా అఖిలేష్ యాద‌వ్ ప్ర‌క‌టించారు. కానీ తాను పోటీ చేయ‌నున్న అసెంబ్లీ స్థానం గురించి క్లారిటీ ఇవ్వ‌లేదు. తాజా గా ఈ రోజు ఎస్పీ పార్టీ వ‌ర్గాలు అఖిలేష్ యాదవ్ పోటీ చేసే అసెంబ్లీ నియోజ‌క వర్గాన్ని ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news