‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా మొక్కలు నాటిన సమంత…!

-

తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడైన జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అనేక మంది రాజకీయ నాయకులు అలాగే సెలబ్రిటీల లతో పాటు అన్ని వర్గాల వారు మొక్కలు నాటి సామాజిక బాధ్యత చేపడుతున్నారు. ఇందులో భాగంగా అక్కినేని నాగార్జున విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను తన కోడలు అక్కినేని సమంతకు విసిరారు. ఈ నేపథ్యంలోనే సమంత నేడు జూబ్లీహిల్స్ లో ఉన్న తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలను నాటారు.

SAMANTHA NAG

ఈ విషయంపై సమంత మాట్లాడుతూ… పార్లమెంటు సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చాలా గొప్పగా ప్రారంభించాలని వీటివలన కాలుష్య నియంత్రణకు చాలా దోహదపడతాయని, అలాగే ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని ఆవిడ తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్క మనిషికి కనీసం మూడు మొక్కలు నాటాలని తెలిపింది. సమంత తన సహచర నటులు కీర్తి సురేష్, రష్మిక మందన లకు ఈ ఛాలెంజ్ ను పూర్తి చేయాలని ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version