పారితోషికం తగ్గించుకున్న అక్షయ్.. కారణం అదే..!?

-

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోలలో అక్షయ్ కుమార్ కూడా ఒకరు అనే చెప్పాలి. అయితే ప్రతి సినిమాకు అక్షయ్ కుమార్ ఏకంగా 120 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారట. ఇక అక్షయ్ కుమార్ సినిమాలకి అటు మార్కెట్ కూడా బాగా ఉన్న నేపథ్యంలో ఇక నిర్మాతలు కూడా అక్షయ్ కుమార్ అడిగిన పారితోషకం వచ్చేందుకు ఎక్కడ వెనకాడరు అనే టాక్ ఉంది. ఇక ప్రస్తుతం అక్షయ్ కుమార్ వరుస సినిమాలు చేసుకుంటూ బ్లాక్బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్నారు.

అయితే అక్షయ్ కుమార్ ఇటీవలే తన పారితోషికాన్ని ఏకంగా 21 కోట్ల వరకు తగ్గించు కున్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. కరోనా వైరస్ కారణంగా నిర్మాతలు నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఏకంగా 99 కోట్లకు తన పారితోషికాన్ని తగ్గించుకున్నాడట స్టార్ హీరో అక్షయ్ కుమార్. కాగా ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోలు కూడా తమ పారితోషకాన్ని తగ్గించుకుని నిర్ణయం తీసుకున్నారు అన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news