అక్షయ్ భారీ విరాళం మరోసారి…!

-

కరోనా వైరస్ పై పోరాటం లో భాగంగా ప్రతీ ఒక్కరు చేస్తున్న సహాయ౦ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆర్ధిక కష్టాలు ఉన్న వాళ్ళు కూడా ప్రజల కోసం ముందుకు వస్తూ తమ వంతుగా సాయం చేస్తున్నారు. కరోనా పోరాటంలో మేము సైతం అని అంటున్నారు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఆయన దాదాపు 28 కోట్లు ఇప్పటి వరకు సహాయం చేసాడు.

తర్వాత మరో మూడు కోట్లు చేసాడు. ఇప్పుడు మళ్ళీ రెండు కోట్లను ముంబై పోలీసులకు ఇచ్చాడు. కరోనా ను కట్టడి చేయడానికి నిరంతరం శ్రమిస్తున్న పోలీసుల కోసం 2కోట్ల రూపాయలు ముంబై పోలీస్ ఫౌండేషన్ కు ఇచ్చాడు. ఈ విషయాన్ని ముంబై పోలీసులు ట్విట్టర్ లో వెల్లడించారు. ఆయన సహాయానికి వారు ధన్యవాదాలు చెప్పారు. ప్రజా రక్షణకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న,

పోలీసు సిబ్బందికి మీ విరాళం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని పేర్కొన్నారు. మరింత నిబద్ధతతో పనిచేసేందుకు ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు. ముంబై పోలీస్ ఫౌండేషన్ తరపున మీకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. దీనికి అక్షయ్ రిప్లయ్ ఇచ్చాడు. కరోనాతో పారాటంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుళ్లు చంద్రకాంత్ పెండూర్కర్, సందీప్ సుర్వేకు నా నివాళులు ప్రకటించి వారికి సెల్యూట్ చేస్తున్నాను అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news